Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపులు.. తండ్రినే హతమార్చిన కుమార్తెలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (10:43 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకూతుళ్లపై మద్యం సేవించి లైంగిక వేధింపులకు గురిచేశాడు కసాయి తండ్రి. చివరికి కూతుళ్లే తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట సీసాలబస్తీలో గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి మాసాని రాజు (50) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతుర్లు సౌమ్య( 17), రమ్య (16)లు ఉన్నారు.
 
ఇతను స్థానికంగా పిండి గిర్నిలో పనిచేస్తుండేవాడు. ఇతడి భార్య ఎనిమిది నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుండి మద్యానికి బానిసగా మారి ఇంట్లో ఉన్న ఇద్దరు కుతుళ్లను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. 
 
కానీ మంగళవారం రాత్రి సమయంలో అతిగా మద్యం సేవించి లైంగికంగా వేధించడంతో ఇద్దరు కూతుళ్లు రాజు గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కూతుర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం