Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసన రాజధాని ఏర్పాటు దిశగా చర్యలు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:34 IST)
అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. అక్కడ భవనాల వినియోగంపై పరిశీలన చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది.

గతేడాది ఆగస్టు 13వ తేదీన సిఎం వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను వినియోగించుకునే అంశంపై పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ రాజధాని పరిధిలో ఉన్న భవనాలన్నిటినీ పరిశీలించి శాసన రాజధానికి తప్పనిసరిగా అవసరమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి, నిర్మాణం మధ్యలో ఉన్న భవనాలు హైకోర్టు, ఇతర కట్టడాలను పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది.

దీంతో అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేయనున్నారనే అంశంపై ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, ప్రణాళికాశాఖ కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అసెంబ్లీ కార్యదర్శి, సాధారణ పరిపాలన, పట్టణాభివృద్ధి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఎఎంఆర్‌డిఏ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. 
 
రాజధాని పరిధిలో కరకట్ట నిర్మాణం, ఉన్న భవనాల వినియోగం తదితర అంశాలపై పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎఎంఆర్‌డిఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం పర్యటించారు.

కరకట్ట నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధాని పరిధిలో నిలిచిపోయిన భవనాల సముదాయాలనూ పరిశీలించారు.

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments