Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి జాతీయ రహదారిపై భారీ చోరీ, రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోపిడీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:46 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై భారీగా చోరీ జరిగింది. ఓ కంటెయినర్ నుంచి రూ.80 లక్షల  విలువగల మొబైల్ పోన్లను దుండుగలు చోరీ చేశారు. ఇందులో 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ నుంచి కొల్ కత్తాకు మొబైల్ ఫోన్లను కంటెయినర్లో తరలిస్తున్నారు.
 
ఆ కంటెయినర్ మంగళగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ వాహనదారుడు కంటెయినర్ వెనుక భాగం తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. ఆ విషయాన్ని కంటెయినర్ డ్రైవర్‌కు తెలిపాడు. దాంతో వాహనన్ని ఆపిన డ్రైవర్ వెనుక భాగంలో పరిశీలించగా అందులో చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాజా టోల్‌గేట్ వద్ద కంటెయినర్‌ను నిలిపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని తెలిపారు. ఇదే తరహా కొన్ని వారాల క్రితం చిత్తూరు జిల్లాలో కంటైనర్ నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వాటి విలువ రూ.10 కోట్లు అని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments