Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ హత్య కేసు.. అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య

Maruthi Rao
Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (09:50 IST)
Maruthi Rao
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమార్తె అమృత ప్రేమించి వివాహం చేసుకున్న ప్రణయ్‌ని దారుణంగా హతమార్చేందుకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావు ఖైరతాబాద్‌లోని వాసవీ భవన్‌లో గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
చింతల్‌బస్తీలో ఉన్న ఈ భవన్‌లో మారుతీరావు శనివారమే గదిని అద్దెకు తీసుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. అలా ఆదివారం ఉదయం అపస్మారక స్థితిలో పడివున్న మారుతీరావును చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి అయిన మారుతీరావు.. ప్రణయ్ హత్యకేసుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తన కుమార్తె అమృత అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. 
 
ఈ క్రమంలో మారుతీరావు 2018లో ప్రణయ్‌ను హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన మారుతీరావు ఇటీవలే బెయిలుపై విడుదలయ్యాడు. బెయిల్‌పై వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా ఆత్మహత్యకు పాల్పడటం వివాదాస్పదమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments