Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుకున్న ప్రేయసితో పెళ్లైంది.. భార్యకు జలుబు చేసిందని మందులు కొనేందుకు వెళ్తే..?

Webdunia
శనివారం, 11 మే 2019 (14:46 IST)
రెండేళ్లు ప్రేమించాడు.. రెండు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే విధి వక్రించింది. రైలు ప్రమాదంలో కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పచ్చని పందరితో వున్న ఆ ఇంట శోకసంద్రంలో మునిగిపోయింది.


ఇక కోరుకున్న ప్రేమికుడితో వివాహం జరిగిందనే సంతోషం ఆ వధువుకు రెండు రోజులు కూడా నిలవలేదు. కాళ్ల పారాణి ఆరకముందే వధువుకు తీరని దుఃఖం మిగిలిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దేవునిపల్లి గ్రామానికి చెందిన కిశోర్‌‌కు తను ప్రేమించిన అమ్మాయితో రెండు రోజుల క్రితం వివాహం జరిగింది. ఈ సమయంలో భార్యకు జలుబు చేసింది. దీంతో ఆమెకు మందులు తీసుకరావడం కోసం బయటకు వచ్చాడు. 
 
ఈ క్రమంలో ఏదో ఆలోచిస్తూ సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతున్న సమయంలో కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న డెమో ప్యాసింజర్‌ వేగంగా ఢీ కొట్టింది.

దీంతో తీవ్ర గాయాలైన కిశోర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారుడి ప్రమాద వార్త తెలుసుకుని అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, భార్య విలపించిన తీరు అక్కడి ఉన్నవారిని కలిచివేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments