అనేక మంది యువతీ యువకులు మాఘ మాసంలో వివాహాలు చేసుకుంటారు. ఈ యేడాది మాఘ మాసం ఈ నెల 31వ తేదీ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు జోరుగా సాగనున్నాయి. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు వరుస ముహూర్తాలు ఉన్నాయి.
మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉందని ప్రముఖ పురోహితుడు పులుపుల ఫణికుమార్ శర్మ అంటున్నారు. ఫాల్గుణ మాసంలో (మార్చి 18వ తేదీ నుంచి 28 వరకు) శుక్ర మౌఢ్యమి రావడంతో ముహూర్తాలు లేవన్నారు. శ్రీరామనవమి తర్వాత మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలవుతుందన్నారు. ఉగాదిలోపు ఎక్కువ వివాహాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగబోతున్నట్లు ఆయన తెలిపారు. వివాహ శుభ ముహుర్తాలు .....