Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏజెన్సీలో కారును తగలబెట్టిన మావోయిస్టులు (Video)

ఠాగూర్
మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న అడ్డగించి, అందులోని ప్రయాణికులను కిందకు దించేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత కారుకు నిప్పుపెట్టి తగలబెట్టేశారు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం కారుకు నిప్పుపెట్టారు. 
 
ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చి, విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది. ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు అనే సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదు. ఇపుడు మళ్లీ జరగడంతో స్థానికంగా కలకలం చెలరేగింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

HIT 3 పహల్గమ్ షూట్ లో ఒకరు చనిపోవడం బాధాకరం: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments