Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్ర‌బాబు, నారా లోకేష్‌కు మావోయిస్టుల బెదిరింపు లేఖ‌... ఆత్మాహుతి దాడి చేస్తాం...

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావో

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (19:17 IST)
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఆంధ్రా ఒరిస్సా స‌రిహ‌ద్దులో భారీ ఎన్‌కౌంట‌ర్‌ను ఖండిస్తూ, ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు తేనె పూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ తన లేఖలో పేర్కొన్నారు. 
 
ఏఓబీలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. భోజనంలో విషం పెట్టి చంపారని ఆరోపించారు. చంద్రబాబు ఇంతకింత ఫలితాన్ని అనుభవిస్తారనీ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బాబులపై అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. పోలీసు అధికారులను కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టాలన్న ప్రణాళికతోనే ఈ ఎన్ కౌంటర్ చేశారనీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు.

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments