Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న్యం పర్యాటక ప్రాంతాల‌లో మందు తాగి అల్ల‌రి చేస్తే ఖ‌బ‌డ్డార్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:44 IST)
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారేడుమిల్లి, గుర్తేడు పోలీస్‌స్టేషన్లలో దస్త్రాలను పరిశీలించారు.
 
 
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల సందర్భంగా మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. అతిథిగృహాలు, రిసార్టులపైనా పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అవసరమైతే పండగల సమయాల్లో తాను మారేడుమిల్లిలోనే బస చేస్తానన్నారు. మారేడుమిల్లి ఇన్‌ఛార్జి సీఐ త్రినాథ్‌, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రామకృష్ణ, సతీశ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments