Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఇప్పట్లో రద్దయ్యేలా లేదు... ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర హోంశాఖకు పంపించింది. ఆ తర్వాత ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లారు. మండలి రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు. అయితే, కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా లేదు.
 
దీంతో సీఎం జగన్ ఇతర ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులోభాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మండలిలో వైసీపీకి మెజార్టీ లేనందున... కలిసొచ్చే సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని అడుగుతున్నట్లు తెలిసింది. 
 
అలాగే, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునే పనిలో ఆయన నిమగ్నమైవున్నట్టు వినికిడి. మొత్తంమీద తాను అనుకున్న పనిని సాధించేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments