Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాండూస్ తుఫాను.. ఏపీ, తమిళనాడు పాఠశాలలకు సెలవులు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (09:56 IST)
మాండూస్ తుఫాను ఏపీ, తమిళనాడును అతలాకుతలం చేసింది. చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో మాండూస్ కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 
 
తమిళనాడులోని మూడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
 
ఇందులో భాగంగా డిసెంబర్ 10, 2022న కూడా చెన్నై పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తమిళనాడులోని పుదుచ్చేరి, చెంగల్పట్టు, వెల్లూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు, కారైక్కల్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. 
 
అలాగే దిండిగల్, కొడైకెనాల్‌లలో అలెర్ట్ జారీ చేయబడింది. ఇంకా తిరువళ్లూరు, చెన్నై, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ సహా మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments