మాండూస్ తుఫాను.. ఏపీ, తమిళనాడు పాఠశాలలకు సెలవులు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (09:56 IST)
మాండూస్ తుఫాను ఏపీ, తమిళనాడును అతలాకుతలం చేసింది. చెన్నైతో పాటు ఇతర జిల్లాల్లో మాండూస్ కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 
 
తమిళనాడులోని మూడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
 
ఇందులో భాగంగా డిసెంబర్ 10, 2022న కూడా చెన్నై పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తమిళనాడులోని పుదుచ్చేరి, చెంగల్పట్టు, వెల్లూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు, కారైక్కల్ వంటి కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. 
 
అలాగే దిండిగల్, కొడైకెనాల్‌లలో అలెర్ట్ జారీ చేయబడింది. ఇంకా తిరువళ్లూరు, చెన్నై, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ సహా మొత్తం తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments