Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాండుస్ తుఫాను ఎఫెక్ట్ - కృష్ణాపట్నం పోర్టులో ఆరో నంబరు హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (21:07 IST)
బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండుస్ తుపాను వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇది మహాబలితీరం వైపు దూసుకొస్తుంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను శనివారం వేకువజామున 4 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం ఓడరేవులో ఆరో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా సూళ్లూరుపేట, నెల్లూరు, కావలి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 
 
తడ మండలం భీములవారి పాళెం వద్ద పులికాట్ సరస్సులో లంగరువేసివున్న మూడు పడవలు నీట మునిగిపోయాయి. అటు బాపట్ల జిల్లా నిజాంపట్న హార్బరులో కూడా మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
 
ముందుకొచ్చిన సముద్రం.. ఎక్కడ? 
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా మైపాడులో సముద్రం ముందుకు వచ్చింది. ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకు 130 కిలోమీటర్లు, తీరం దాటే ప్రాంతంగా అంచనా వేస్తున్న మహాబలిపురానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. 
 
అయితే, ఈ తుపాను ప్రభావం కారణంగా నెల్లూరు మైపాడు బీచ్ వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పైగా, ఈ ప్రాంతంలో సముద్రం 30 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. తుపాను ప్రభావంతో గాలుల వేగం క్షణం క్షణం పెరిగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాలుల తీవ్ర పెరిగిన దృష్ట్యా మైపాడు బీచ్‌‍కు సందర్శకులు రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments