Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీవ్ర తుఫానుగా మారిన మాండూస్ - నేడు అతి భారీ వర్షాలు

mandous cyclone
, శుక్రవారం, 9 డిశెంబరు 2022 (09:21 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. దీని కారణంగాణ ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. 
 
గడిచిన 6 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ప్రయాణిస్తుందని, ప్రస్తుతం ఇది జాఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 240 కిలోమీటర్లు, కారైక్కాల్‌కు 240 కిలోమీటర్లు, చెన్నైకు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుందని తెలిపారు. 
 
ఇది వచ్చే ఆరు గంటలు తీవ్ర తుఫానుగా తీవ్రతను కొనసాగించి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది ఐఎండీ వెల్లడించింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం తెల్లవారుజాములోపు పుదుచ్చేరి శ్రీహరికోటల మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది.
 
తీరందాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం కారణంగా శుక్ర, శనివారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి... రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం : వైఎస్ షర్మిల