Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని ఆస్పత్రిలో ఈడీ సోదాలు.. సీఎండీ మణి వద్ద విచారణ

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (16:58 IST)
విజయవాడ నగరంలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆస్పత్రి సీఎండీ మణిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గత ఆగస్టు నెలలో ఈ ఆస్పత్రి ప్రారంభంకానా, వైద్య సీట్ల భర్తీలో భాగంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం భారీ మొత్తంలో నిధులు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్నారై, మేనేజ్‌మెంట్ కోటాల్లో వైద్య సీట్ల కేటాయింపుల్లో భారీ మొత్తంలో నిధులు వసూలు చేసినట్టు ఈడీ అధికారులకు సమాచారం ఉన్నట్టు వినికిడి. ఈ కారణంగానే ఈడీ అధికారులు శుక్రవారం ఈ ఆస్పత్రిలో సోదాలకు దిగింది. 
 
ఆస్పత్రి చుట్టూత సీఆర్పీఎఫ్ బలగాల భద్రతను కల్పించారు. ఆస్పత్రిలో పని చేసే ప్రధాన సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్పత్రిలోకి ఎవరినీ అనుమతించకుండా ఈడీ అధికారులు గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments