Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులదురహంకార హత్య.. కారులో ఎక్కించుకున్నారు.. గొంతుకోశారు..

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:25 IST)
రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. ఓ యువకుడు కులదురహంకార హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండల కేంద్రమైన కనగానపల్లిలో ఉంటోన్న బిసి సామాజిక తరగతికి చెందిన చిట్రా నాగను, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు కురుబ చిట్రా మురళి (27) అదే గ్రామంలోని ఒసి సామాజిక తరగతికి చెందిన ఎం.వీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
సామాజిక తరగతులు వేరంటూ వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో, వీరిద్దరూ పెద్దలను ఎదిరించి 2021 ఆగస్టులో వివాహం చేసుకున్నారు.  వీరిద్దరూ రాప్తాడులో ఉంటూ వారివారి ఉద్యోగాలకువెళ్లి వస్తుండేవారు. గురువారం రాత్రి కియాకువెళ్లేందుకు రాప్తాడు వై.జంక్షన్‌ వద్ద మురళి వేచి ఉన్నాడు. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న యువతి కుటుంబ సభ్యులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారు.
 
అక్కడి నుంచి రాప్తాడు సమీపంలోని త్రిబుల్‌ ఆర్‌ ‌ రెస్టారెంట్‌ వద్దకుతీసుకెళ్లి కత్తితో మెడకోసి హత్య చేసి సమపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశారని యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబసభ్యులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments