Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులదురహంకార హత్య.. కారులో ఎక్కించుకున్నారు.. గొంతుకోశారు..

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:25 IST)
రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. ఓ యువకుడు కులదురహంకార హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండల కేంద్రమైన కనగానపల్లిలో ఉంటోన్న బిసి సామాజిక తరగతికి చెందిన చిట్రా నాగను, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు కురుబ చిట్రా మురళి (27) అదే గ్రామంలోని ఒసి సామాజిక తరగతికి చెందిన ఎం.వీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
సామాజిక తరగతులు వేరంటూ వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో, వీరిద్దరూ పెద్దలను ఎదిరించి 2021 ఆగస్టులో వివాహం చేసుకున్నారు.  వీరిద్దరూ రాప్తాడులో ఉంటూ వారివారి ఉద్యోగాలకువెళ్లి వస్తుండేవారు. గురువారం రాత్రి కియాకువెళ్లేందుకు రాప్తాడు వై.జంక్షన్‌ వద్ద మురళి వేచి ఉన్నాడు. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న యువతి కుటుంబ సభ్యులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారు.
 
అక్కడి నుంచి రాప్తాడు సమీపంలోని త్రిబుల్‌ ఆర్‌ ‌ రెస్టారెంట్‌ వద్దకుతీసుకెళ్లి కత్తితో మెడకోసి హత్య చేసి సమపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశారని యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబసభ్యులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments