Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రాదని... పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగి.. యువకుడి మృతి

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (15:05 IST)
కరోనా రాకుండా ఉండేందుకు చిట్కా పాటించి ఓ యువకుడు చనిపోగా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచ్చ బొల్లారం పరిధి చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్​(30) ప్రైవేటు ఎంప్లాయ్​. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఇరుగు పొరుగు ఇచ్చిన సలహాతో సురేశ్​తో పాటు అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కొంతకాలంగా పాటిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి కూడా వారు పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికి ముగ్గురు వాంతులు చేసుకోగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ కండీషన్ ​సీరియస్​గా ఉండగా గాంధీ ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. అతని భార్య, తల్లి ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల కంప్లయింట్​తో అల్వాల్ పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments