కన్నకొడుకు మూర్ఛరోగి.. శ్మశానానికి మోసుకెళ్లి.. గొంతునులిమి.. కిరోసిన్ పోసి?

కన్నకొడుకు మూర్చరోగి కావడం.. 23ఏళ్లు వచ్చినా ఆ వ్యాధి అతని వెన్నంటి రావడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కుటుంబ భారాన్ని మోయాల్సిన వయస్సులో భారంగా మారాడని భావించిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. గతేడాది

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2017 (14:51 IST)
కన్నకొడుకు మూర్చరోగి కావడం.. 23ఏళ్లు వచ్చినా ఆ వ్యాధి అతని వెన్నంటి రావడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కుటుంబ భారాన్ని మోయాల్సిన వయస్సులో భారంగా మారాడని భావించిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. గతేడాది నవంబరు 15 అర్ధరాత్రి వేళ ఫిట్స్‌ వచ్చినప్పుడు కొడుకును స్వయంగా కన్నతండ్రే శ్మశానానికి మోసుకెళ్లాడు. అక్కడే కుమారుడి గొంతు నులిమి హత్య చేశాడు.
 
అంతటితో ఆగకుండా మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏమీ తెలియనట్లుగా ఇంటికొచ్చాడు. మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయి వుంటాడని ఇంట్లో వున్నవారందరినీ నమ్మించాడు. అయితే శ్మశానంలో శవం సగమే కాలింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. హంతకుడు తండ్రేనని తెలిసి షాక్ తిన్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఏడుగురు తల్లిదండ్రులకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా చేశారు. 
 
చివరికి కందులాపురం గ్రామానికి చెందిన కుల్లూరి శ్రీనివాసరావే హంతకుడని తేలింది. అతనికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు వెంకట్రావుకు 14 ఏళ్ల నుంచే మూర్ఛ వ్యాధి ఉంది. ఎందరు వైద్యులకు చూపించినా జబ్బు నయం కాలేదు. 23 ఏళ్ల వయస్సొచ్చినా భారంగా మారాడని చంపేశాడని తేలింది. ఏడాది తర్వాత ఈ కేసు కొలిక్కివచ్చింది. కన్నకొడుకు పడే బాధను చూడలేకే చంపేశానని శ్రీనివాసరావే ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments