తెదేపాకి రాజీనామా చేసి వైకాపాలోకి మాగుంట...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (18:39 IST)
పురుషులందు పుణ్య పురుషులు వేరయా... అన్నట్లు... పార్టీకి రాజీనామా చేసి వెళ్లే వాళ్లందరూ తిడ్తూనే వెళ్లక్కర్లేదని నిరూపించారు తాజాగా తెదేపాకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. తెదేపాకి రాజీనామా చేసిన అనంతరం తన అనుచరులతో సమావేశమైన తర్వాత వైకాపాలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. వైఎస్‌తో ఉన్న అనుబంధంతోనే వైకాపాలో చేరుతున్నానని మాగుంట చెప్పారు. 
 
చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందనీ, పార్టీలో చంద్రబాబు అన్ని రకాలుగా సహకరించారని మాగుంట వ్యాఖ్యానించారు. ఎంపీగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చంద్రబాబును కొనియాడారు.
 
అయితే.. పార్టీని వీడిపోతున్న నేతలందరూ సదరు పార్టీ అధినేతలపై, పార్టీపై విమర్శలు చేసి మరీ వెళుతుంటే మాగుంట మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి మాగుంట ప్రశంసించడంతో వైకాపాని షాక్‌కి గురి చేస్తోంది. వైసీపీకి మాగుంట వ్యాఖ్యలు మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments