Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌చిలీప‌ట్నం బెల్ కంపెనీ... దేశ రక్షణ పరికరాల ప్రదర్శన

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:06 IST)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే గర్వకారణం అని, దేశ రక్షణ, భద్రతలో భారత్ ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంద‌ని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. మ‌చిలీప‌ట్నంలో శనివారం స్థానిక భారత్ ఎలక్ట్రానిక్స్ ను మంత్రి పేర్నినాని సందర్శించారు. 
 
 
ఆజాదీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుండి  19వ తేదీ వరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారయ్యే దేశ రక్షణ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసిన పరికరాల‌ను, యుద్ధంలో వాడినప్పుడు సైనికులు  పొందే అనుభూతి వాటిని చూసినప్పుడు విద్యార్థులు కూడా గొప్ప అనుభూతి పొందగలరని మంత్రి అన్నారు. దేశ రక్షణకు వాడే పరికరాలు మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ బి ప్రభాకర్ రావు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments