Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల రోజులు సెలవుపై వెళ్లిపోయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (16:46 IST)
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకుగురైన ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెల ఆరో తేదీ వరకు సెలవు పెట్టారు. ఏపీ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను అవమానకరరీతిలో తొలగించిన విషయం తెల్సిందే. 
 
జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో అధికారులు తత్తరపాటుకు లోనయ్యారు. అదేసమయంలో ఏపీ తాత్కాలిక సీఎస్‌గా నిరబ్ కుమార్‌ను ఎంపిక చేసి, ఎల్వీని బాపట్లలోని హెచ్ఆర్డీ విభాగం డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఇపుడు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తాత్కాలిక సీఎస్ నీరబ్ కుమార్‌కు ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పగించారు. 
 
మరోవైపు, బాపట్లలో హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments