Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలపడుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్షం

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:41 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గడ్, తెలంగాణ మీదుగా ఒడిసా వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం  ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
 
కాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదిత జిల్లాలలో పాటు ఏపీ లోని ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాలలో చిరు జల్లులు కురిసాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments