Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలపడుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్షం

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:41 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గడ్, తెలంగాణ మీదుగా ఒడిసా వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం  ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
 
కాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదిత జిల్లాలలో పాటు ఏపీ లోని ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాలలో చిరు జల్లులు కురిసాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments