Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలపడుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్షం

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:41 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గడ్, తెలంగాణ మీదుగా ఒడిసా వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం  ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
 
కాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదిత జిల్లాలలో పాటు ఏపీ లోని ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాలలో చిరు జల్లులు కురిసాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments