Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పాలనలో పన్నుల బాదుడే బాదుడు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల భారం తడిసి మోపెడవుతోంది. రెవెన్యూ లోటుకు తోడు.. కరోనా కష్టాలు వచ్చి చేరడంతో ఏపీ ఖజానా నిండుకుంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు రెచ్చిపోయారు. ఫలితంగా పన్నుల భారం మోపి కోట్ల రూపాయలను పిండుకుంటున్నారు. 
 
గత ఐదు నెలల కరోనా కాలంలో ఏపీ 15000 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులోభాగంగా, కేంద్రం అనుమతితో రూ.31 వేల కోట్లు రుణంగా స్వీకరించనుంది. మరో రూ.15 వేల కోట్ల మేరకు పన్నుల రూపంలో వసూలు చేసింది. 
 
అంతేకాకుండా మరో 3000 కోట్ల రూపాయలను రాబట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే, మద్యం ధరలను 75 శాతం మేరకు పెంచడం వల్ల రూ.13500 కోట్ల మేరకు ఆదాయాన్ని రాబట్టుకుంది. ఆ తర్వాత జూన్ నెలలో పెట్రోల్, డీజల్‌పై సుంకాన్ని పెంచడం వల్ల మరో రూ.600 కోట్ల మేరకు ఆదాయాన్ని రాబట్టుకుంది. 
 
అలాగే, రాష్ట్రంలో భూముల ధరలు పెంచడం వల్ల అదనంగా రూ.800 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదికాకుండా, ప్రొఫెనల్ ట్యాక్స్‌ను పెంచడం వల్ల రూ.161 కోట్లు, 10 శాతం వ్యాట్ పెంచడం వల్ల మరో రూ.300 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments