Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పాలనలో పన్నుల బాదుడే బాదుడు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నుల భారం తడిసి మోపెడవుతోంది. రెవెన్యూ లోటుకు తోడు.. కరోనా కష్టాలు వచ్చి చేరడంతో ఏపీ ఖజానా నిండుకుంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. దీంతో అధికారులు రెచ్చిపోయారు. ఫలితంగా పన్నుల భారం మోపి కోట్ల రూపాయలను పిండుకుంటున్నారు. 
 
గత ఐదు నెలల కరోనా కాలంలో ఏపీ 15000 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఇందులోభాగంగా, కేంద్రం అనుమతితో రూ.31 వేల కోట్లు రుణంగా స్వీకరించనుంది. మరో రూ.15 వేల కోట్ల మేరకు పన్నుల రూపంలో వసూలు చేసింది. 
 
అంతేకాకుండా మరో 3000 కోట్ల రూపాయలను రాబట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాగే, మద్యం ధరలను 75 శాతం మేరకు పెంచడం వల్ల రూ.13500 కోట్ల మేరకు ఆదాయాన్ని రాబట్టుకుంది. ఆ తర్వాత జూన్ నెలలో పెట్రోల్, డీజల్‌పై సుంకాన్ని పెంచడం వల్ల మరో రూ.600 కోట్ల మేరకు ఆదాయాన్ని రాబట్టుకుంది. 
 
అలాగే, రాష్ట్రంలో భూముల ధరలు పెంచడం వల్ల అదనంగా రూ.800 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదికాకుండా, ప్రొఫెనల్ ట్యాక్స్‌ను పెంచడం వల్ల రూ.161 కోట్లు, 10 శాతం వ్యాట్ పెంచడం వల్ల మరో రూ.300 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments