Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. అయినా ప్రేమ వారిని వదల్లేదు.. ఆత్మహత్య చేసుకున్నారు..

పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Webdunia
సోమవారం, 31 జులై 2017 (12:28 IST)
పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాప్రా జమ్మిగడ్డకు చెందిన కృష్ణ, మాసపేట కావ్య (25) దంపతులు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు. 
 
కానీ అదే ప్రాంతంలో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న నాగరాజు (25) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నాగరాజుకు పెళ్లి కాలేదు. విషయం నాగరాజు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక కావ్య, నాగరాజు 27న ఇంటి నుంచి బయటికొచ్చారు. ఆపై మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సికింద్రాబాద్‌ వైపు వచ్చే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారు నాగరాజు, కావ్యగా గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments