Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారు... పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు.. రైలు కిందపడి ఆత్మహత్య

ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:35 IST)
ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కరణం సందీప్‌ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి మౌనిక (21)లు ప్రేమికులు. 
 
ఇద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. చీరాల రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు. ఆపై విజయవాడకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు సానుకూలంగా స్పందించకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామనే విషయాన్ని తిమ్మసముద్రంలోని తన మిత్రుడు సందీప్‌కు మెసేజ్ పెట్టారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments