Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారు... పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు.. రైలు కిందపడి ఆత్మహత్య

ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:35 IST)
ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కరణం సందీప్‌ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి మౌనిక (21)లు ప్రేమికులు. 
 
ఇద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. చీరాల రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు. ఆపై విజయవాడకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు సానుకూలంగా స్పందించకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామనే విషయాన్ని తిమ్మసముద్రంలోని తన మిత్రుడు సందీప్‌కు మెసేజ్ పెట్టారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments