Webdunia - Bharat's app for daily news and videos

Install App

17ఏళ్ల అబ్బాయి, 22 ఏళ్ల అమ్మాయి.. పురుగుల మందు తాగి బావిలో దూకేశారు..

Webdunia
శుక్రవారం, 25 డిశెంబరు 2020 (16:00 IST)
17ఏళ్ల అబ్బాయి, 22 ఏళ్ల అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరూ బావిలో శవమై తేలారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం వడ్ల అమృతండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన కంటే వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కుదరదని, తమ పెళ్లిని పెద్దలు అంగికరించరానే భయంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు చేసుకుంది.
 
పదోతరగతి విద్యార్థి గూగులోత్‌ ప్రశాంత్‌ (17) ఆ గ్రామానికి చెందిన డిగ్రీ పూర్తిచేసిన భూక్యా ప్రవీణ (22)ని ప్రేమించాడు. వీరిద్దరి మనుసులు కలవడంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి కొద్ది రోజులు తిరిగారు. ఈ క్రమంలో సోమవారం కలుసుకున్న ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుని తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
 
బుధవారం రోజున ఇద్దరూ బావిలో శవమై తేలారు. బావిలో వారిని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు,తల్లిదండ్రులకు సమాచారం. వారి శవాలను బయటకు తీసిన పోలీసులు శవ పరీక్ష నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. 
 
బావి సమీపంలో పురుగుల డబ్బా కూడా లభ్యం కావడంతో ఇద్దరూ ముందు పురుగుల మందును తాగి అనంతరం బావిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇరు కుటుంబాలను పిలిచి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments