Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ చట్టంలో లొసుగులు: ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (06:02 IST)
దేశంలో మహిళలకు స్వాతంత్య్రం రాలేదని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో ఆమె మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా 30 లక్షల నేరాలు నమోదవుతుంటే రాష్ట్రంలో 1.50 లక్షల నేరాలు ఉన్నాయని తెలిపారు. అందులో ప్రతీ ఏటా మన దేశంలో 15 వేల కేసులు మహిళలకు సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.  మహిళలపై అకృత్యాలు జరిగే దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గు చేటని ఆవేదన వెలిబుచ్చారు.

నిర్భయ ఘటనతో కేంద్రంలో చట్టం చేసినప్పటికీ.. అందులో లొసుగుల కారణంగా నేరస్థులను జైలులో మేపుతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణకే దిశ చట్టం తెచ్చామన్నారు. ప్రతి పాఠశాలలోనూ మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టాలని సూచించారు.

మహిళలకు ఆపద వస్తే 100, 1012, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం హోం మంత్రిని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సత్కరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments