Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి: వైసీపీ

Webdunia
బుధవారం, 6 మే 2020 (20:49 IST)
లోకేష్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు అన్నారు. మంగళగిరి పట్టణంలోని వైకాపా మాజీ కౌన్సిలర్ సంకే సునీత నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు మునగాల మలేశ్వరావు, గుంటూరు పార్లమెంటు అధికార ప్రతినిధి శ్యామ్ బాబు మాట్లాడారు.

మంగళగిరి పట్టణంలో 32వ వార్డు లో చోటుచేసుకున్న ఘటన నారా లోకేష్ స్క్రీన్ ప్లే లొనే జరిగిందని దాన్ని వైయస్సార్ సిపి నియోజకపార్టీ ఖండిస్తుందని అన్నారు. కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారని. మంగళగిరి పట్టణంలో రెండు పాసిటీవ్ కేసులు నమోదై వారు పూర్తిగా కోలుకుని ఇంటికి చేరిన సంగతి తెలిసిందేనని అన్నారు.

ఈ తరుణంలో కుల రాజకీయాలకు తెర తీయటం సరికాదని విమర్శించారు. మంగళగిరి లో పోటీ చేసి గెలవలేదన్న కక్షతో ఇక్కడ వివాదాలు చేయాలని చూడడం సరికాదన్నారు.

గోరంతను కొండంత చేయడంలో తెదేపా ముందుంటుందని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని నిజానిజాలు తెలుసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments