Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకేష్ సాయం చోరీకి గురైంది

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (08:07 IST)
ఓ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చేసిన ఆర్థిక సాయం చోరీకి గురైంది. దీంతో ఆ బాధితులు లబోదిబోమంటున్నారు.
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన అంధ దంపతులు పాపిరెడ్డి, రేవతికి ముగ్గురు కుమారులు. ఎనిమిదేళ్ల వయసున్న వీరి పెద్ద కుమారుడు గోపాలకృష్ణారెడ్డి ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. తల్లిదండ్రులను ఆటోలో కూర్చోబెట్టుకుని గ్రామాల్లో వివిధ తిరుగుతూ రకాల పప్పులు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్నారు.

ఎనిమిదేళ్ల బాలుడు ఆటో నడిపే వీడియో ప్రసార మాధ్యమాల్లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్‌ స్పందించి పాపిరెడ్డి కుటుంబానికి తొలిసారిగా రూ.20 వేలు, రెండో విడత రూ.80 వేలను టీడీపీ నాయకుల ద్వారా అందజేశారు. రెండో విడత ఇచ్చిన నగదును పాపిరెడ్డి తన ఇంట్లో ట్రంక్‌ పెట్టిలో పెట్టారు.

మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. బుధవారం ఉదయం ట్రంక్‌ పెట్టిలో చూడగా, రూ.80 వేల నగదు మాయమైందని గుర్తించారు. ఇంటి పరిసరాల్లో తనిఖీ చేయగా ఓ సెల్‌ఫోను దొరికింది.

దీంతో పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసి, దొరికిన సెల్‌ఫోనును పోలీసులకు అప్పగించారు. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. కాగా, మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments