Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌: భర్త దూరంగా ఉన్నాడని కొండపై నుంచి దూకేసిన భార్య

Webdunia
శనివారం, 30 మే 2020 (14:49 IST)
భర్త బెంగుళూరులో.. భార్య ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో. లాక్ డౌన్‌తో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. భర్త లేకుండా ఉండలేని భార్య ఆవేదనతో తీవ్ర మనస్థాపం చెంది కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
 
వారిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. అయితే లాక్‌డౌన్ వారిద్దరినీ వేరు చేసింది. మదనపల్లెలోని వేంపల్లి పంచాయతీ మల్లయ్యకొండ వద్ద ఉన్న బాలాజీనగర్‌లో అత్తమామల ఇంటికి వచ్చింది భార్య సుజనకుమారి. 
 
అప్పుడే లాక్ డౌన్ స్టార్టయ్యింది. బెంగుళూరుకు వెళ్ళలేక అత్తమామతో కలిసి ఉండేది. భర్త విశ్వనాథ్‌తో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఎలాగైనా మదనపల్లెకి వచ్చేయ్యమని భర్తను కోరింది. అయితే రాష్ట్ర సరిహద్దులో పంపించరని.. భార్యకు నచ్చచెబుతూ వచ్చాడు భర్త.
 
భర్త లేకుండా ఒంటరి జీవితాన్ని అనుభవించలేని భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ రోజు అత్త, మామలతో కలిసి మల్లయ్య కొండకు వెళ్ళింది. అత్త, మామలు కొండపై నమస్కారం చేస్తుండగా వారి కళ్ళు గప్పి అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్లి లోయలోకి దూకేసింది సుజన. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments