Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్: రోడ్డుపైన తిరగవద్దన్నందుకు ఆరుగురు యువకులు వృద్ధురాలిపై కత్తులతో దాడి..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:08 IST)
తిరుపతిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్లపైన తిరగవద్దని చెప్పినందుకు ఒక వృద్ధురాలిపై కత్తులతో దాడికి దిగారు. కొర్లగుంటలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఎదురుగా ఒక వృద్ధురాలు కిరాణా కొట్టు నడుపుతోంది. లాక్ డౌన్ ఉన్నా ఆరుమంది యువకులు అటు ఇటూ తిరుగుతూ కనిపించారు.
 
రోడ్లపై తిరగకూడదని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది వృద్ధురాలు. యువకులు వినిపించుకోకపోవడంతో అటువైపుగా వెళుతున్న పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు యువకులను హెచ్చరించి పంపేశారు. వృద్ధురాలిపై కక్ష పెంచుకన్న యువకులు ఆమెపై దాడి చేసి గాయపరిచారు. కిరాణా కొట్టులో ఉన్న సామాన్లను ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు.
 
వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన బాధితురాలి మనువడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది యువకులు రోడ్లపై ఆకతాయిగా తిరుగుతూ కనిపిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తూ యథావిథిగా వారు రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments