Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్: రోడ్డుపైన తిరగవద్దన్నందుకు ఆరుగురు యువకులు వృద్ధురాలిపై కత్తులతో దాడి..

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:08 IST)
తిరుపతిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్లపైన తిరగవద్దని చెప్పినందుకు ఒక వృద్ధురాలిపై కత్తులతో దాడికి దిగారు. కొర్లగుంటలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఎదురుగా ఒక వృద్ధురాలు కిరాణా కొట్టు నడుపుతోంది. లాక్ డౌన్ ఉన్నా ఆరుమంది యువకులు అటు ఇటూ తిరుగుతూ కనిపించారు.
 
రోడ్లపై తిరగకూడదని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది వృద్ధురాలు. యువకులు వినిపించుకోకపోవడంతో అటువైపుగా వెళుతున్న పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు యువకులను హెచ్చరించి పంపేశారు. వృద్ధురాలిపై కక్ష పెంచుకన్న యువకులు ఆమెపై దాడి చేసి గాయపరిచారు. కిరాణా కొట్టులో ఉన్న సామాన్లను ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు.
 
వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన బాధితురాలి మనువడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది యువకులు రోడ్లపై ఆకతాయిగా తిరుగుతూ కనిపిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తూ యథావిథిగా వారు రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments