Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొల్లిపరలో వారం రోజుల పాట లాక్డౌన్.. ఏప్రిల్ 10 నుంచి..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (15:14 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వేలాది కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొల్లిపర మండలంలో లాక్ డౌన్ విధించారు. 
 
కొల్లిపర మండలంలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వ తేదీ నుంచి ఈనెల 16 వ తేదీ వరకు వారం రోజులపాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. హోటల్స్, టీ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే భట్టిప్రోలు మండలంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments