Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయం వద్దు... యథావిధిగా రైలు సర్వీసులు... : రైల్వే బోర్డు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:50 IST)
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. నానిటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు, లాక్డౌన్ భ‌యం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయా? లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పందించారు. రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా కొన‌సాగుతాయ‌ని చెప్పారు. 
 
రైళ్ల‌ను ఆప‌డం లేదా త‌గ్గించే ఆలోచ‌న ఏదీ లేద‌న్నారు. ప్ర‌యాణించాల‌నుకున్న వాళ్ల‌కు రైళ్ల కొర‌త లేద‌ని కూడా సునీత్ తెలిపారు. ఈ స‌మ‌యంలో రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ సాధార‌ణంగానే ఉంద‌ని, క్ర‌మంగా రైళ్ల సంఖ్య‌ను పెంచుతామ‌ని చెప్పారు. 
 
ఇక రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ కూడా అవ‌స‌రం లేద‌ని సునీత్ స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌యాణికులు సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ భ‌యాల‌తో ముందే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments