Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయం వద్దు... యథావిధిగా రైలు సర్వీసులు... : రైల్వే బోర్డు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:50 IST)
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. నానిటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు, లాక్డౌన్ భ‌యం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయా? లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పందించారు. రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా కొన‌సాగుతాయ‌ని చెప్పారు. 
 
రైళ్ల‌ను ఆప‌డం లేదా త‌గ్గించే ఆలోచ‌న ఏదీ లేద‌న్నారు. ప్ర‌యాణించాల‌నుకున్న వాళ్ల‌కు రైళ్ల కొర‌త లేద‌ని కూడా సునీత్ తెలిపారు. ఈ స‌మ‌యంలో రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ సాధార‌ణంగానే ఉంద‌ని, క్ర‌మంగా రైళ్ల సంఖ్య‌ను పెంచుతామ‌ని చెప్పారు. 
 
ఇక రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ కూడా అవ‌స‌రం లేద‌ని సునీత్ స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌యాణికులు సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ భ‌యాల‌తో ముందే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments