భయం వద్దు... యథావిధిగా రైలు సర్వీసులు... : రైల్వే బోర్డు

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:50 IST)
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. నానిటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఇంకోవైపు, లాక్డౌన్ భ‌యం వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయా? లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ స్పందించారు. రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా కొన‌సాగుతాయ‌ని చెప్పారు. 
 
రైళ్ల‌ను ఆప‌డం లేదా త‌గ్గించే ఆలోచ‌న ఏదీ లేద‌న్నారు. ప్ర‌యాణించాల‌నుకున్న వాళ్ల‌కు రైళ్ల కొర‌త లేద‌ని కూడా సునీత్ తెలిపారు. ఈ స‌మ‌యంలో రైల్వే స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ సాధార‌ణంగానే ఉంద‌ని, క్ర‌మంగా రైళ్ల సంఖ్య‌ను పెంచుతామ‌ని చెప్పారు. 
 
ఇక రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డానికి కొవిడ్ నెగ‌టివ్ రిపోర్ట్ కూడా అవ‌స‌రం లేద‌ని సునీత్ స్పష్టం చేశారు. కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో రైల్వే స్టేష‌న్ల‌లోనూ ప్ర‌యాణికులు సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ భ‌యాల‌తో ముందే చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments