Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో లాక్డౌన్? క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (18:50 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి నిర్భంధంతో పాటు కొన్నిచోట్ల లాక్డౌన్ కొనసాగుతోంది. 
 
తాజాగా లాక్‌డౌన్ నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధం విధించడం వలన ఆర్థికంగా నష్టపోతామన్నారు. గతేడాది అమలు చేసిన లాక్డౌన్ వలన ఏపీకి రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 
 
రాష్ట్రంలో మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొన్నటివరకు వందల్లో ఉన్న కేసులు ప్రస్తుతం 2 వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీలో వేగం పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముందుగా దృష్టిసారించాలన్నారు. 
 
గ్రామాల్లో రోజుకు 4లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments