జగన్ హిందువు కాదు క్రైస్తవుడు: పరిపూర్ణానందస్వామి

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:55 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు.. క్రైస్తవుడని స్పష్టం చేశారు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హిందువని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ప్రమేయం లేని స్వచ్ఛమైన హిందువులతో టిటిడి బోర్డు ఏర్పాటు చేయలేరా అంటూ ప్రశ్నించారు పరిపూర్ణానందస్వామి.
 
రాయలసీమ ఆధ్మాత్మిక వైభవాన్ని నాయకులు చాటిచెప్పలేకపోతున్నారని విమర్సించారు. రాయలసీమ విలువలను జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఓటర్లు ఆలోచించాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో 350 ఆలయాలు కూలిపోయాయని.. దేవదాయశాఖామంత్రి సిఎంకి చెప్పినా స్పందించరా అంటూ ప్రశ్నించారు.
 
తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై 25 సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టిటిడిని తీసుకురావాలన్నారు. ఆలయంలో అన్యమతస్తులు పేరుకుపోతున్నా ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
 
పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని ప్రశ్నించిన పరిపూర్ణానందస్వామి అధికారంలోకి రావాలంటే శ్రీవారిపై మాట్లాడాలనే భావజాలం ఏర్పడిపోయిందన్నారు. దేవుడు గుర్తుకు రావాల్సిన ప్రాంతం కేంద్రంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి అంటేనే వివాదాల పుట్టగా మారిపోయిందన్నారు పరిపూర్ణానందస్వామి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments