Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ హిందువు కాదు క్రైస్తవుడు: పరిపూర్ణానందస్వామి

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (17:55 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు.. క్రైస్తవుడని స్పష్టం చేశారు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ హిందువని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ ప్రమేయం లేని స్వచ్ఛమైన హిందువులతో టిటిడి బోర్డు ఏర్పాటు చేయలేరా అంటూ ప్రశ్నించారు పరిపూర్ణానందస్వామి.
 
రాయలసీమ ఆధ్మాత్మిక వైభవాన్ని నాయకులు చాటిచెప్పలేకపోతున్నారని విమర్సించారు. రాయలసీమ విలువలను జాతీయస్థాయిలో నిలబెట్టేలా ఓటర్లు ఆలోచించాలన్నారు. వైసిపి ప్రభుత్వంలో 350 ఆలయాలు కూలిపోయాయని.. దేవదాయశాఖామంత్రి సిఎంకి చెప్పినా స్పందించరా అంటూ ప్రశ్నించారు.
 
తిరుమల శ్రీవారి ఆస్తులు, భూములు, క్రయ విక్రయాలపై 25 సంవత్సరాల శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి టిటిడిని తీసుకురావాలన్నారు. ఆలయంలో అన్యమతస్తులు పేరుకుపోతున్నా ఎవరూ మాట్లాడటం లేదని మండిపడ్డారు.
 
పింక్ డైమండ్ వ్యవహారం ఏమైందని ప్రశ్నించిన పరిపూర్ణానందస్వామి అధికారంలోకి రావాలంటే శ్రీవారిపై మాట్లాడాలనే భావజాలం ఏర్పడిపోయిందన్నారు. దేవుడు గుర్తుకు రావాల్సిన ప్రాంతం కేంద్రంగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుపతి అంటేనే వివాదాల పుట్టగా మారిపోయిందన్నారు పరిపూర్ణానందస్వామి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments