Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. 'స్థానిక పోరు' నిర్ణయంపై ఇపుడు స్టే ఇవ్వలేం : ఏపీ హైకోర్టు

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మరోమారు చుక్కెదురైంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. 
 
కాగా, గత మార్చి నెలలో ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. అనేక ప్రాంతాల్లో ఏకగ్రీవంగా అనేక మంది ఎన్నికయ్యారు కూడా. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ఎన్నికల కోసం జారీచేసిన నోటిఫికేషన్ కూడా రద్దు అయింది. 
 
ఈ క్రమంలో వచ్చే యేడాది ఫిబ్రవరిలో పంచాయతీ పోల్స్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, అందువల్ల ఈ ఎన్నికల నిర్వహణ నిర్ణయంపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో ఏపీ సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments