Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మద్యం మరింత ప్రియం... 25 శాతం బాదుడు?!

Webdunia
ఆదివారం, 3 మే 2020 (15:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మరింత ప్రియంకానుంది. రాష్ట్రంలో వైకాపా సర్కారు ఏర్పాటైన తర్వాత మద్యం ధరలను విపరీతంగా పెంచింది. అయినప్పటికీ మద్యం విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు. ఇపుడు మరోమారు ఏకంగా 25 శాతం మేరకు ధరలను పెంచాలని ఏపీ సర్కారు భావిస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పెంచిన కొత్త ధరలతో మద్యం విక్రయాలు జరపాలని భావిస్తోంది. 
 
నిజానికి గత ఎన్నికల ప్రచార సమయంలో వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన ఆ దిశగానే అడుగులు వేశారు. బెల్టు షాపులను తొలగించారు. మద్యం అనుబంధ బార్లను ఎత్తివేశారు. పైగా, మద్యాన్ని ప్రభుత్వమే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ చర్యలన్నీ మద్యం నియంత్రణలో భాగంగానే తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇపుడు మద్యం ధరలను 25 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా సోమవార నుంచి దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments