Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిమాను ఉత్సవాలు : ఏపీలో మద్యం దుకాణాలు మూసివేత

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (16:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18, 19వ తేదీల్లో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న, సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి ఆదేశించారు. 
 
ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని ఉన్న, నగరానికి సమీపంలో గల మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఈ రెండు రోజుల పాటు సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని, నిబంధనలు అమలు చేయాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించి మద్యం దుకాణాలు లేదా బార్లను తెరిచివుంచే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమ ఆదేశాల్లో స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments