Webdunia - Bharat's app for daily news and videos

Install App

Liquor Price: సంక్రాంతికి మందుబాబులకు ఫుల్ కిక్కు.. రూ.99లకే క్వార్టర్‌ మద్యం

సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (15:40 IST)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని చంద్రబాబు సర్కారు కొత్త మద్యం విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రూ.99లకే క్వార్టర్‌ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం వైన్స్‌లలో రూ.99లకే క్వార్టర్‌ లభించింది. దీంతో ప్రజలు మందు కిక్కులో మునిగారు. దీనికి తోడు సంక్రాంతికి మద్యం ధరలను తగ్గించింది. భోగి రోజే మద్యం ధరలు భారీగా తగ్గించింది. 
 
కోడిపందాలతోపాటు మద్యంలో ప్రజలు మునిగితేలేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గడంతో ఫుల్‌ కిక్కు ఇట్టే తగ్గించారు. దీంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. 
 
కాగా మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించడంతో తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా ప్రారంభమైంది. ఏపీలో రూ. 99లకే క్వార్టర్‌ మద్యానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మద్యం విక్రయాలు జోరందుకోవడంతో మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటుకు మద్యం అందిస్తామని ముందుకువస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments