Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందిద్దాం: అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (20:10 IST)
స్వాతంత్ర్య సమరయోధుల అందించిన స్వేచ్ఛా ఫలాలను ప్రజలందరికీ అందిద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ అవరణలో మువ్వెన్నెల జెండాను శనివారం ఆయన ఎగుర వేశారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనన్నారు. ఆనాటి స్వాతంత్ర్య సమర యోధులు తమ ప్రాణ త్యాగాలతో దేశ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్య అందజేశారని, వాటి ఫలాలు ప్రజలందరికీ అందిద్దామని అన్నారు.

ప్రపంచంలోనే భారత దేశం మొదటి స్థానంలో నిలబెట్టడానికి ప్రస్తుత నేతలందరూ అహర్నిశలూ కృషి చేస్తున్నారని కొనియాడారు. జాతీయ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడానికి ధైర్యంగా ముందుకు సాగుదామన్నారు. ప్రజా తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాలు వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయకంపితం చేస్తోందని, మానవాళి ఉనికికే ప్రమాదకరంగా మారిందన్నారు. ప్రజలంతా ఐక్యంగా ధైర్య సాహాసాలతో కరోనా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు అసెంబ్లీ భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారం జాతీయ జెండాను ఎగుర వేశారు.
 
శానసమండలిలో ఘనంగా పంద్రాగస్టు...
అమ‌రావ‌తి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాసనమండలి ఆవరణలో చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు, శాసనమండలి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments