ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

ఠాగూర్
సోమవారం, 17 మార్చి 2025 (16:39 IST)
ఉపాధి కోసం పలు భాషలను నేర్చుకోవాలని, భాషతో రాజకీయాలు చేయొద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంగ్లీష్ అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే భాష మాత్రమేనని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషలో చదివి రాణించిన వారే ఎక్కువని ఆయన గుర్తు చేశారు. 
 
సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రియల్ టైమ్ పీ-4 డాష్ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను కూడా ఇందులోనే భాగస్వాములను చేశామని వెల్లడించారు. వారి నుంచి వచ్చిన అభిప్రాయాలను తీసుకునే నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. పీ-4ను ఉగాది రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 
 
మొత్తంగా 35 లక్షల మంది పేదరికంలో ఉంటే మొదటి దశలో 20 లక్షల మంది, రెండో దశలో 15 లక్షల మందిని పెడతామని తెలిపారు. వీరికి చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితాను కూడా సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గాల వారీగా పీ-4 కార్యక్రమం సక్రమంగా అమలు కావాలని అన్నారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments