Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...

తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన రెండు బోన్లలో ఒక మగ చిరుతపులి తెల్లవారుజామున పడింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చిరుత కోసం ఫారెస్టు అధికారులు బోను ఏర్పాటు చేశారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:10 IST)
తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన రెండు బోన్లలో ఒక మగ చిరుతపులి తెల్లవారుజామున పడింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చిరుత కోసం ఫారెస్టు అధికారులు బోను ఏర్పాటు చేశారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చిరుతను పట్టుకోవడానికి బతుకున్న కుక్కలను వాటికి ఆహారంగా బోనులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
తిరుపతి కపిలేశ్వరాలయ సమీపంలో గత నాలుగు రోజులుగా తల్లి, పిల్ల చిరుతలు రెండూ సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారులకు సమాచారం రావడంతో వాటిని బంధించేందుకు ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన బోన్లో ఉదయం మగ చిరుత పిల్ల చిక్కింది. చిరుత చిక్కిన వెంటనే దానిని తిరుపతి ఎస్వీ జూపార్కు అధికారులకు సమాచారం ఇచ్చి చిరుతను జూకు తరలించారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా చిరుతను పట్టుకోవడానికి బతికి ఉన్న రెండు కుక్కలను వాటికి ఆహారంగా అధికారులు బోనుపై పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జంతువును పట్టుకోవడానికి మరొక జంతువును ఎలా ఎరగా వేస్తారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments