Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మళ్ళీ చిరుతపులి ప్రత్యక్షం, ఈసారి ఎక్కడంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:17 IST)
తిరుమలలో జంతువుల సంచారం ఎక్కువగా కనబడుతోంది. నిత్యం రద్దీగా వుండే తిరుమల గిరులు భక్తులు లేక ఖాళీగా వుండటంతో జంతువులు యథేచ్ఛగా తిరిగేస్తున్నాయి. జింకలు, అడవిపందులు, చిరుతలు ఇలా తిరుమలలో జనం తిరిగే ప్రాంతంలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
 
తిరుమలలోని పద్మావతినగర్ లోని అశ్విని ఆసుపత్రి వద్ద అర్థరాత్రి చిరుత సంచరించింది. ఇది మ్యూజియంకు సమీపంలో ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతంలోనే దిగుతుంటారు. అయితే అలాంటి ప్రాంతంలో పెద్దగా జనం లేకపోవడంతో చీకటి అయితే చాలు తిరుమల మొత్తం నిర్మానుషం మారిపోవడంతో జంతువులు వచ్చేస్తున్నాయి.
 
వెలుతురు ఎక్కువగా ఉన్నా సరే నిర్మానుషమైన వాతావరణం కావడంతో జంతువులు ఇష్టానుసారం తిరిగేస్తున్నాయి. గత వారంరోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్డులోనే చిరుత వాహనదారులపై దాడి చేసింది. అలాగే తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో చిరుత హల్చల్ చేసింది.
 
ఇది కాస్త స్థానికులకు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నం చేశారు. కానీ చివరకు చిరుత జాడను గుర్తించలేకపోయారు. తాజాగా చిరుత తిరుమలలో మళ్ళీ ప్రత్యక్షమవడం.. అది కాస్తా సిసి.టివి ఫుటేజ్‌లో బయట పడటంతో భక్తుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments