Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మళ్ళీ చిరుతపులి ప్రత్యక్షం, ఈసారి ఎక్కడంటే?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:17 IST)
తిరుమలలో జంతువుల సంచారం ఎక్కువగా కనబడుతోంది. నిత్యం రద్దీగా వుండే తిరుమల గిరులు భక్తులు లేక ఖాళీగా వుండటంతో జంతువులు యథేచ్ఛగా తిరిగేస్తున్నాయి. జింకలు, అడవిపందులు, చిరుతలు ఇలా తిరుమలలో జనం తిరిగే ప్రాంతంలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
 
తిరుమలలోని పద్మావతినగర్ లోని అశ్విని ఆసుపత్రి వద్ద అర్థరాత్రి చిరుత సంచరించింది. ఇది మ్యూజియంకు సమీపంలో ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది ఈ ప్రాంతంలోనే దిగుతుంటారు. అయితే అలాంటి ప్రాంతంలో పెద్దగా జనం లేకపోవడంతో చీకటి అయితే చాలు తిరుమల మొత్తం నిర్మానుషం మారిపోవడంతో జంతువులు వచ్చేస్తున్నాయి.
 
వెలుతురు ఎక్కువగా ఉన్నా సరే నిర్మానుషమైన వాతావరణం కావడంతో జంతువులు ఇష్టానుసారం తిరిగేస్తున్నాయి. గత వారంరోజుల క్రితమే తిరుమల ఘాట్ రోడ్డులోనే చిరుత వాహనదారులపై దాడి చేసింది. అలాగే తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో చిరుత హల్చల్ చేసింది.
 
ఇది కాస్త స్థానికులకు, భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీశాఖాధికారులు ప్రయత్నం చేశారు. కానీ చివరకు చిరుత జాడను గుర్తించలేకపోయారు. తాజాగా చిరుత తిరుమలలో మళ్ళీ ప్రత్యక్షమవడం.. అది కాస్తా సిసి.టివి ఫుటేజ్‌లో బయట పడటంతో భక్తుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments