Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతివనం వద్ద రామోజీకి వీడ్కోలు : కన్నీటితో సాగనంపిన కుటుంబ సభ్యులు - ఆభిమానులు

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (11:54 IST)
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత సీహెచ్.రామోజీ రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనం వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బంది ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీ రావు కుమారుడు కిరణ్ అంతి సంస్కారాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య పోలీసుల గౌరవ వందనంతో రామోజీ రావు అంత్యక్రియలను పూర్త చేశారు. 
 
ఈ అంత్యక్రియలకు ఈనాడు, రామోజీ గ్రూపు సంస్థలకు చెందిన ఉద్యోగులు వందల సంఖ్యలో తరలివచ్చాయి. అంతిమ సంస్కారాల్లో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వర రావు, వి.హనుమంతరావు, కేఆరు సురేశ్ రెడ్డి, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 
 
కాగా, రామోజీరావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ నిమాసం నుంచి సాగిన యాత్రలో ఆయన పాల్గొని రామోజీ రావు పాడె మోశారు. స్మతివనం వద్ద రామోజీకి కడసారి వీడ్కోలు పలికారు. పూలతో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments