Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమయ్యా... చంద్రబాబూ, ఇలా చేశావేందయ్యా...? 'అత్త' లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (18:11 IST)
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి లేదు.. జయంతి లేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం నేరుగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. మీ గౌరవాన్ని, మీ పేరును చెడగొట్టేందుకు అల్లుడు చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నాడంటూ ఒక పేజీ లెటర్ రాసి ఘాట్ వద్ద ఉంచింది లక్ష్మీపార్వతి. గంటపాటు మౌనంగా కూర్చుండి పోయింది. ఆ తరువాత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు.
 
నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. ప్రజలను మోసగించడం.. నెరవేరని హామీలివ్వడం.. వెన్నుపోట్లు పొడవడం ఇలా ఒకటేమిటి. అన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన వ్యక్తి ఆత్మ క్షోభించేలా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసినందుకు సంతోషపడేవారని బాబు చెప్పడం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
 
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని చంద్రబాబు ఏ విధంగా కాంగ్రెస్‌తో స్నేహం చేస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు అలా అయిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments