Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుతో ఆంధ్రా ఆక్టోపస్‌‌ భేటీ ఎందుకు? రాజకీయాల్లోకి రీ ఎంట్రీ?

రాజకీయ జోస్యాలతో ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించుకున్న లగడపాటి రాజగోపాల్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన లగడపాటి వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబుతో దాదాపు 40 న

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (09:53 IST)
రాజకీయ జోస్యాలతో ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించుకున్న లగడపాటి రాజగోపాల్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన లగడపాటి వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

లగడపాటి ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చాలా బాగుందని, తాత్కాలిక సచివాలయమే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక శాశ్వత సచివాలయం ఏ స్థాయిలో నిర్మిస్తారోనని బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
ఏ పార్టీకి దగ్గరైతే రాజకీయ భవిష్యత్తుకు మంచిదో సొంత సర్వే చేయించుకున్న లగడపాటి.. టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాగా తెలంగాణ ఏర్పాటు అనంతరం రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన లగడపాటి మాట నిలబెట్టుకున్నారు. కానీ లగడపాటి రాజకీయాలపై మొగ్గుచూపుతున్నారు.

మరి చంద్రబాబుతో భేటీ ద్వారా టీడీపీకి దగ్గరవుతారా? లేకుంటే బీజేపీ ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments