Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతలను వేటకొడవళ్లతో నరికేసిన బీజేపీ నేతలు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:45 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు జరిగాయి. వైకాపాకు చెందిన ఇద్దరు నేతలను భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు చంపేశారు. వేటకొడవళ్ళతో వేటాడి మరీ హత్య చేశారు. ఈ జంట హత్యలు జిల్లాలోని కౌతల మండలం కామవరం అనే గ్రామంలో జరిగాయి. 
 
వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నలతో బీజేపీకి చెందిన మల్లిఖార్జునకు ఓ భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైకాపాలో, మల్లిఖార్జున వర్గం బీజేపీలో ఉన్నారు. అయితే, భూగొడవ విషయంలో మాట్లాడేందుకు గురువారం ఉదయం ఇరు వర్గాలు సమావేశమయ్యాయి. 
 
ఈ సమావేశం కాస్త రసాభాసగా మారింది. చివరకు ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మల్లిఖార్జున వర్గం నేతలు శివప్ప, ఈరన్నలపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కామవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments