Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాడి చేతిలో మోసపోయిన వైకాపా ఎంపీ - రూ.97 వేలు మాయం

Webdunia
బుధవారం, 4 మే 2022 (08:21 IST)
ఓ సైబర్ నేరగాడి చేతిలో సాక్షాతో ఓ ఎంపీ మోసపోయాడు. ఫలితంగా ఎంపీ ఖాతా నుంచి రూ.97 వేలను సైబర్ నేరగాడు క్షణాల్లో ఖాళీ చేశాడు. మోసపోయిన వైకాపా ఎంపీ పేరు సంజీవ్ కుమార్. వైకాపా ఎంపీ. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఎంపీ సంజీవ్ కుమార్‌కు మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని, దాన్ని వెంటనే పాన్ నంబరుతో అప్‌డేట్ చేసుకోవాలంటూ ఓ సందేశం వచ్చింది. ఇందుకోసం కింది లింక్‌ను క్లిక్ చేయాలని అందులో ఉంది. ఈ సందేశం నిజమేనని నమ్మిన ఎంపీ లింక్ ఓపెన్ చేసి వివరాలను ఫిల్ చేసి సెండ్ చేశాడు. ఆ వెంటనే ఆయనకు మొబైల్ నంబరుకు ఓటీవీ వచ్చింది. 
 
ఆ మరుక్షణం సైబర్ నేరగాడు ఫోన్ చేసి తాను హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్ చేసేందుకు మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరడంతో సదరు ఎంపీ ఆ ఓటీపీని చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే ఒకసారి రూ.48,700, మరో దఫా రూ.48,999 డ్రా అయినట్టు ఎంపీకి ఫోను సందేశం వచ్చింది. 
 
అది చూసి హతాశుడైన ఎంపీ తాను సైబర్ నేరగాడి చేతిలో మోసపోయినట్టు గ్రహించి బ్యాంకుకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అలాగే, సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. సైబర్ నేరగాడు మంత్రి ఖాతా నుంచి రూ.97699 కాజేసినట్టు తేలింది. పోలీసులు కేసును విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments