Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య.. ముగ్గురు పిల్లలున్న కామాంధుడు ఫ్రెండ్ చెల్లిని చెరబట్టి రేప్

వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కామాంధుడు బాల్య స్నేహితుడి చెల్లెలిని చెరబట్టి ఆపై ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వ

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (20:13 IST)
వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్న ఓ కామాంధుడు బాల్య స్నేహితుడి చెల్లెలిని చెరబట్టి ఆపై ప్రేమ పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం హైదరాబాద్ మల్కాజ్‌గిరి పోలీసు ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కేతావత్‌ రాజు(25) అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈయనకు వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే, రాజు వద్ద ఓ యువకుడు పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో రాజు స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్లివచ్చేవాడు. ఆ క్రమంలో రాజు అతడి చెల్లెలు(16)పై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పడంతో ఆ యువతి నమ్మేసింది. 
 
ఈ క్రమంలో ఈనెల 19వ తేదీన మల్కాజ్‌గిరి నుంచి కర్నూలు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కూతురు కనిపించడం లేదని బాలిక తల్లి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలుకు తీసుకెళ్లిన రాజు... ఆ యువతిని చెరబట్టి అత్యాచారం చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాజును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments