Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పు చేయకపోతే.. ఉలికిపాటు ఎందుకు చంద్రమా? కేటీఆర్ సూటి ప్రశ్న

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (11:48 IST)
తెలుగు రెండు రాష్ట్రాల అధికార పార్టీల మధ్య ఐటీ గ్రిడ్ సంస్థ డేటా చోరీపై మాటల యుద్ధం కొనసాగుతోంది. డేటా దుర్వినియోగంపై ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. 
 
డేటా స్కామ్‌పై ట్విటర్‌ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. మీరు ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుంది అనే కదా మీ భయం చంద్రబాబు.? భయంతోనే విచారణకు ముందుకు రావడంలేదు? పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ఏపీ ప్రభుత్వం ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనంటూ కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. 
 
'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అన్నట్లు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపులు ఎందుకు చంద్రబాబు? తెలంగాణ పోలీసుల దర్యాప్తునకు ఏపీ పోలీసులు అడ్డుకోవడం, కోర్టులో తప్పుడు పిటీషన్లు వేయడం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించడంలో చంద్రబాబు పాత్రను పరోక్షంగా నిర్దారిస్తుంది. ఈ అంశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కె. తారక రామారావు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments