Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు కాల్వలోకి దూసుకెళ్లి మహిళ మృతి .. నలుగురికి గాయాలు

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (14:01 IST)
ఉయ్యూరు మండల కలవపాముల గ్రామం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు. ఈ ప్రమాదంలో గుడివాడకు చెందిన గౌరీ కుమారి 60 సంవత్సరాల మహిళ మృతి. 
 
కార్తీక మాసం నోము నిమిత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు గన్నవరం వెళ్లి నుంచి గుడివాడ తిరిగి వెళ్తున్న క్రమంలో కలవపాముల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి ఆదివారం రాత్రి 11 గంటలకు దూసుకుపోయింది.
 
ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న నలుగురిని కాపాడగా గౌరీ కుమారి మహిళను కాపాడే సమయానికి ఆలస్యం కావడంతో నీరు ఎక్కువగా తాగేసి మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. 
 
ఘటనా సమాచారాన్ని అందుకున్న గ్రామీణ ఎస్సై దుర్గ మహేశ్వరరావు ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఐపీసీ 304ఏ సెక్షన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ దుర్గా మహేశ్వరరావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments